29 April, 2026 | 10:50 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

విధులకు వెళ్లిన యువకుడు అదృశ్యం

29-04-2026 08:49 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): ఇంటి నుండి విధులకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్ హెచ్ ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం జవహర్ నగర్ పరిధిలోని బాలాజీ నగర్ సిపిఐ కాలనీలో యాప్రాల్ ఆనంద్ కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నారు. ఆనంద్ చిన్న కుమారుడు యాప్రాల్ తరుణ్( 31 )ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈనెల 26న విధులకు వెళ్తున్నానని చెప్పి  బయటకు వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. దీంతో అతని ఆచూకీ కోసం పనిచేస్తున్న ఆఫీసులో వాకబు చేసినా బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు తండ్రి ఆనంద్ జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.