1 April, 2026 | 2:44 PM

Breaking News

రాజక్కపల్లిలో ఉచిత గాలికుంటు టీకాలు   •   రాజక్కపల్లిలో ఉచిత గాలికుంటు టీకాలు   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ   •   అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్‌సభ ఆమోదం.. వైసీపీ వాకౌట్‌   •   లోక్‎సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు.. కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు   •   ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •  

భార రహిత విద్యావ్యవస్థ జాతీయ సదస్సుకు యాపర్ల ఉపాధ్యాయుడు

09-10-2025 12:00 AM

ఉపాధ్యాయుడు మురళీకృష్ణకు అభినందనలు

పెబ్బేరు, అక్టోబర్ 8 : నేడు గుజరాత్ రాష్ట్ర రాజధాని గాంధీ నగర్ లో జరిగే జాతీయ విద్యా సదస్సు కు యాపర్ల ఉపాధ్యాయుడు మురళీ కృష్ణ హాజరు కానున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, ప్రధానోపాధ్యాయులు ఉస్సేన్, గ్రామస్తులు బుధవారం అభినందించారు. విద్యార్థుల పుస్తకాల బ్యాగు బరువు తగ్గించే ప్రయత్నం, నాణ్యమైన విద్య కోసం సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.

జాతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో గుజరాత్ లో ఏర్పాటు చేసిన సదస్సు కు తెలంగాణ రాష్ట్రం నుంచి నలుగురు ఉపాధ్యాయులు ఎంపిక అయ్యారు. మన స్థానిక సంస్కృతి, సాంప్రదాయ పద్ధతిలో వృత్తి విద్యా తరహా నూతన వరవడిలో భోధన మంచి ఫలితాలు వస్తాయి అనే అంశం పై ఉపాధ్యాయుడు మురళీ కృష్ణ పరిశోధన పత్రం సదస్సు లో సమర్పించనున్నారు. ఈయన ఎంపిక పట్ల జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ ఘని, ఎంఈవో జయరాములు, ప్రధానోపాధ్యాయులు హుస్సేన్, ఎస్సీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాగ్య లక్ష్మి, లతో పాటు గ్రామస్తులు అభినందించారు.