10 April, 2026 | 7:20 PM

Breaking News

మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన హాఫీజుద్దీన్   •   ప్రతి గడపకూ సంక్షేమ కాంతి.. ప్రతి రైతుకూ ప్రభుత్వ భరోసా : మంత్రి పొంగులేటి   •   నిఘా నేత్రల ఏర్పాటులో భాగస్వామ్యులు కావాలి   •   గబ్బిలాల పేటలో ప్రభుత్వ పాఠశాల సాధించే వరకు పోరాటం ఆగదు   •   షార్ట్ సర్క్యూట్‌తో వీదినపడ్డ నిరుపేద కుటుంబం   •   క్యాంటీన్‌లో మిల్లెట్స్ వంటకాలు అందుబాటులోకి తేవాలి   •   ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే   •   ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం   •   అందరికీ విద్య, వైద్యం, ఉద్యోగం కోసం సిపిఐ పోరాటం...   •   వడదెబ్బకు వ్యక్తి మృతి   •  

రుజువు చేస్తా.. రాజీనామా చేస్తారా?

30-11-2025 01:26 AM
  1. హిల్ట్ స్కామ్‌ను తేల్చకపోతే నేను రిజైన్ చేస్తా

సీఎం, మంత్రులకు బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సవాల్

హైదరాబాద్, నవంబర్ 29 (విజయక్రాంతి): ‘హిల్ట్ పాలసీ ల్యాండ్ లూటీ స్కా మ్ అని రుజువు చేస్తే మీరు పదవులకు రాజీనామా చేస్తారా? కుంభకోణం అని నిరూ పించకుంటే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా’ అని, ఈ సవాల్‌కు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి సిద్దమా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికే కాదు, క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులకు సవాల్ చేస్తున్న.

మహేశ్వర్‌రెడ్డి శనివారం అసెంబ్లీ మీడియా పా యింట్ వద్ద కుర్చీ వేసుకుని కూర్చున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌కు కూడా రెండు కుర్చీలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... హిల్ట్ పాలసీ రూ.ఆరు లక్షల కోట్ల మేర అవినీతికి ఆస్కారమున్న ల్యాండ్ లూటీ స్కామ్ అని రుజువు చేస్తానని అన్నరు. రుజువు చేయలేకపోతే తాను రాజకీయ సన్యాసం స్వీకరిస్తాన ని, మరి రుజువు చేస్తే మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ చేశారు. ల్యాండ్ లూటీ మాఫి యా డాన్‌లా వ్యవహరిస్తున్న రేవంత్‌రెడ్డి కూడా సీఎం పదవికి రిజైన్ చేయాలన్నారు.