25 July, 2026 | 4:55 PM

వీక్లీ ఫరెడ్ సుదర్శన

25-07-2026 04:00 PM

నిర్మల్ జులై 25 ( విజయక్రాంతి): వీక్లీ పరేడ్ నిర్వహించడం వల్ల సిబ్బందిలో విధి నిర్వహణ నైపుణ్యాలు మెరుగుపడటమే కాకుండా, శారీరక దృఢత్వంతో ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శనివారం నిర్మల్ జిల్లా పోలీస్ ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో సివిల్, ఆర్మ్డ్,రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పరేడ్‌లో పాల్గొన్న సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. వ్యాయామాన్ని నిత్యజీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.

క్రమశిక్షణతో విధులు నిర్వహించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే చెడు వ్యసనాలకు అలవాటు పడి విధులను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బైంసా ఏఎస్పీ సాయికిరణ్, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, రవీందర్, సత్యనారాయణ, దీపక్, కృష్ణ, సమ్మయ్య, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రామ్ నిరంజన్ రావు, శేఖర్, ఎస్సైలు, ఆర్‌ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.