25 July, 2026 | 5:36 PM

Breaking News

టిఐసిసిఐ రాష్ట్ర మీడియా, సాంస్కృతిక విభాగ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా రామావత్ నాగేంద్ర నాయక్ నియామకం   •   సర్ ప్రక్రియలో పారదర్శకతకు రాజకీయ పార్టీల సహకారం కీలకం   •   అభివృద్ధి పనులకు నిధులు మంజూరు   •   డిసిసి అధ్యక్షుడుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు   •   కోటగుళ్లలో ఘనంగా తొలి ఏకాదశి పూజలు   •   బిజెపి యువమోర్చా ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడిగా సూర్వి అనిల్ గౌడ్   •   జిల్లా జన గణన హ్యాండ్ బుక్ ప్రమాణాలకు అతిథంగా తీర్చిదిద్దాలి   •   జాతీయ ఓబీసీ సభలు జయప్రదం చేయండి   •   కాటారం మోడల్ సోలార్ విలేజ్ పనులు వేగవంతం చేయాలి   •   హైకోర్టు న్యాయమూర్తులకు స్వాగతం పలికిన కలెక్టర్   •  

వాడివేడిగా మున్సిపల్ సమావేశం

25-07-2026 04:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపల్ సమావేశం అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్ల మధ్య వివాదం మధ్య వాడి వేడిగా ముగిసింది. అభివృద్ధి విషయంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొని అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ మున్సిపల్ సమావేశంలో చర్చించారు. నిర్మల్ మున్సిపాలిటీకి ప్రభుత్వపరంగా నిధులు వస్తున్న అధికార పార్టీ నేతలు తమ వార్డుల్లోనే అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నారని బిజెపి కౌన్సిలర్లు ఆరోపించారు.

కాంగ్రెస్ కౌన్సిలర్లు అడ్డు చెబుతూ నిర్మల్ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వైఖరి కారణంగానే అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని ఆరోపించారు. టిఆర్ఎస్ ఎంఐ పార్టీ నాయకులు రాజకీయాలు మాని పట్టణ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి మున్సిపల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి కమిషనర్ రవిబాబు అధికారులు పాల్గొన్నారు.