27 February, 2026 | 5:03 AM

రైతులకు అండగా ఉంటాం

27-02-2026 01:12 AM

నిర్మల్, ఫిబ్రవరి ౨౬ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగల వర్షం వల్ల నష్టపోయిన రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. గురువారం సోన్ మామడా లక్ష్మణ్ చందా మండలంలోని ఆయా గ్రామాల్లో వర్షాల వల్ల దెబ్బతిన పంటలను సందర్శించి రైతులతో మాట్లాడారు.

వ్యవసాయ శాఖ అన్ని గ్రామాల్లో సర్వే చేసి నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపిన వెంటనే ఆర్థిక సాయం అందించేలా ప్రభుత్వంతో మాట్లాడుతామని ఆయన రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పిఎసిహెచ్ మాజీ చైర్మన్ కృష్ణ ప్రసాద్ రెడ్డి నాయకులు పండి లింగన్న సతీష్ రెడ్డి శ్రీనివాస్ తదితరులున్నారు.