12 March, 2026 | 6:50 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మహానేతలను ఆదర్శాలను పాటించాలి

12-03-2026 04:56 PM

నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): మండలంలోని బొల్లారం జిల్లా పరిషత్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సామాగ్రిని బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి పేరుపల్లి సాయిబాబా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....మహానేతల ఆదర్శాలను పాటించాలని,విజ్ఞానంతోనే సమాజంలో గౌరవం పెరుగుతుందన్నారు.ప్రాథమిక స్థాయి నుండి ప్రణాళిక బద్ధమైన చదువులు అలవర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు.

గత కేసిఆర్ ప్రభుత్వంలో వేలాది మోడల్ స్కూల్ ఏర్పాటు చేసి ప్రతి నిరుపేదలు సైతం నాణ్యమైన విద్యను కార్పొరేట్ స్థాయిలో అందించేందుకు కృషి జరిగిందన్నారు.అలాగే పదవ తరగతిలో మంచి మార్కులు సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు.మండలంలోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులందరికీ ఎగ్జామ్స్ స్పాట్స్ మరియు ఇతర సామాగ్రి అందజేసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.