గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
09-03-2026 12:53 AM
ఏటూరునాగారం, మార్చి8 (విజయక్రాంతి): ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రోయ్యూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కావేరి అర్జున్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి మహిళలను శాలువాతో సన్మానించారు. అనంతరం 99రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామంలో కాలువల పూడికతీత పనులు చేపట్టారు. గ్రామంలో సేవలందిస్తున్న మహిళా సిబ్బంది పారిశుద్ధ కార్మికురాలు వరలక్ష్మి గ్రామ ఏఎన్ఎం రమ్య సేవలను ప్రశంసించారు. గ్రామ అభివృద్ధి కోసం అందరూ కలిసి పనిచేయాలని సర్పంచ్ అర్జున్ పిలుపునిచ్చారు.




