14 July, 2026 | 6:55 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలి

06-01-2026 12:46 AM

ఆదిలాబాద్ ఎంపీ గడం నగేష్ 

ఖానాపూర్, జనవరి 5 (విజయక్రాంతి): రానున్న మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటి సీట్లు కైవసం చేసుకోవాలని ఆదిలాబాద్ ఎంపీ గెడం నగేష్ అన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పర్యటించారు. ఈ మేరకు ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బిజెపి సర్పంచులను వార్డు సభ్యులను ఆయన సన్మానించారు. రాజురా, రంగపేట, బీర్ నంది, తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు.

అనంతరం ఎంపీని ఖానాపూర్ సాయిబాబా ఆలయంలో ఆలయ కమిటీ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రితీష్ రాథోడ్ ,ఆలయ కమిటీ చైర్మన్ కొక్కుల ప్రదీప్, బిజెపి మండల అధ్యక్షులు అంకం మహేందర్, రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్, నాయకులు నాయిని సంతోష్, అనిల్ రావు ,రాజేందర్ పాల్గొన్నారు.