13 May, 2026 | 4:44 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

అభివృద్ధికి కంకణ బద్ధుడినై పనిచేస్తా

08-02-2026 01:38 AM

8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి మూడవత్ బాలకోటి 

భూత్పూర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మున్సిపల్ పట్టణంలోని 8వ వార్డు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, వార్డు ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పక అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మూడవత్ బాలకోటి అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఇంటింటికి ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ఐదేళ్లపాటు ప్రజలకు సేవకునిగా పని చేసేందుకు 8వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తానని, వార్డు ప్రజలు ఆదరించి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

8వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా వారికి అండగా ఉంటానన్నారు. వార్డు పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానన్నారు. వార్డు అభివృద్ధికి తాను కట్టుబడి ఉంటారన్నారు. ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సహకారంతో నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేపడుతానన్నారు.8వ వార్డులో నెలకొన్న సమస్యలను గెలిచిన వెంటనే  పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, వార్డులోని ప్రజలకు నిరంతరం మీ మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కార దిశగా కృషి చేస్తానని అందుకు ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.