ఉత్తమ్ సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి
12-03-2026 04:47 PM
మంగాపురం తండాలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్
గరిడేపల్లి,(విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్(Minister Uttam) సహకారంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని మంగాపురం గ్రామ సర్పంచ్ బత్తిని అంజయ్య గౌడ్ అన్నారు.మండలంలోని మంగాపురం తండ లో ఎన్ఆర్ జిఎస్ నిధులనుండి వచ్చిన ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పని చేస్తుందని ఆయన అన్నారు.కార్యక్రమంలో కారింగుల కృష్ణమూర్తి,మాజీ ఎంపీటీసీ బాల్ దూరి సందీప్,ఉప సర్పంచ్ ధరావత్ భాష, బూర,రేఖ, హార్జ,బత్తిని చిన్న మల్లయ్య,నాగరాజు,నరసింహారావు,రవి,పలువురు గ్రామ పెద్దలు పాల్గొన్నారు




