విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పల్లె బాట
28-04-2026 05:50 PM
మఠంపల్లి,(విజయక్రాంతి): విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పల్లెబాట కార్యక్రమంలో భాగంగా మఠంపల్లి మండలంలోని పాత దొనబండ తండా గ్రామంలో విద్యుత్ శాఖ సిబ్బంది పర్యటించి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిస్తున్న చెట్ల కొమ్మలను సిబ్బంది సహాయంతో తొలగింపజేశారు. ఈ సందర్భంగా ఏఈ హరీష్ రెడ్డి, సర్పంచ్లు బానోతు ఘుమ మంద నాయక్ తో కలిసి సోమవారం మాట్లాడుతూ... వర్షాకాలం సమయంలో విద్యుత్ షాక్ గురై ప్రమాదం ఉన్నందున తగు జాగ్రత్తలు పాటించాలని, వర్షాలకు గోడలు తడిసినప్పుడు పరికరాలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్త పడాలన్నారు.ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలపై ఏఈ కి వినతిపత్రం అందజేశారు.






