13 May, 2026 | 4:43 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ఘనంగా వీరబ్రహ్మేంద్రస్వామి జయంతి వేడుకలు

03-11-2025 01:38 AM

చేర్యాల, నవంబర్ 02:సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఆదివారం శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 417 వ జయంతిని పురస్కరించుకొని మహామాయ దేవి ఆలయంలో కొలువుదీరిన వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో విశ్వబ్రాహ్మణ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష అభిషేకం, అర్చనలు, స్వామివారి మూల మంత్ర హోమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మే ర్గోజు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి రాళ్లబండి భాస్కర్, గౌరవాధ్యక్షులు రాళ్లబండి నాగరాజు, పోలోజు శ్రీహరి, మేర్గోజు నారాయణ, మేర్గోజు రామచంద్రం, వినోద్, మేర్గోజు జనార్ధన్, మేర్గోజు మహేష్ తదితరులు పాల్గొన్నారు.