పిల్లల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తు
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
47వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ గుర్రం వెంకటేశ్వర్లు (జివిఆర్)
పాల్వంచ,(విజయక్రాంతి): ఆరోగ్యమంతమైన పిల్లలే సమాజ భవిష్యత్తుకు మూలం అనే 47వ డివిజన్ కార్పొరేటర్ జి.వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం పాత పాల్వంచ 47వ డివిజన్లోని ప్రైమరీ స్కూల్ ఆవరణలో ఉన్న అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "పిల్లల ఆరోగ్య పరిరక్షణ ప్రతి తల్లిదండ్రి బాధ్యత. పోలియో వంటి వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే 0 నుండి 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఒక్క చిన్నారిని కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
పాత పాల్వంచ ప్రజలకు విజ్ఞప్తి:
0 నుండి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి సమీపంలోని పోలియో కేంద్రంలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, ఆరోగ్యవంతమైన భావి తరాల నిర్మాణానికి సహకరించండి.






