27 April, 2026 | 11:48 AM

Breaking News

న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం   •   హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి   •   హైదరాబాద్లో పెట్రోల్, డీజిల్ కొరత.. ​ఎక్కడ చూసిన నో స్టాక్ బోర్డులు   •   నార్కెట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ మృతి   •   ప్రతి కుటుంబం ఖచ్చితంగా వివరాలు నమోదు చేసుకోవాలి: భట్టి విక్రమార్క   •   బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు.. ఒక విప్లవం!   •   శ్రీవారి సేవలో తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు   •   దమ్మాయిగూడెం వద్ద రెండు లారీలు ఢీ   •   నిరుపేద చిన్నారి ప్రాణాల కోసం పోరాటం – దాతల సాయం కోసం తల్లిదండ్రుల విజ్ఞప్తి   •   బంకులు బంద్.. ప్రజలు పరేషాన్   •  

ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతి

27-04-2026 01:14 AM

మద్నూర్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మద్నూర్ మండల కేంద్రంలో ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన ధర్మం,దానం,సేవాభావానికి ప్రతీక అయిన  శ్రీ వాసవీమాత‘ జయంతిని అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా జరుపుకన్నారు. ఇందులో భాగంగా సమస్త ఆర్యవైశ్య సోదర-సోదరీమణులంబరూ, పిల్లాపాపలతో కలిసి ఆర్యవైశ్య సంఘ భవనం నుండి బస్టాండ్ హనుమాన్ మందిరం వరకు భక్తి-శ్రద్ధలతో, సుమధుర కీర్తనలతో, మంగళారతులతో శోభాయాత్రను నిర్వహించారు.

తదనంతరం  ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవమైన శ్రీవాసవీమాత జయంతిని తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన శుభ సందర్భంగా మద్నూర్ ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు వంగపల్లి యోగేష్ ఆధ్వర్యంలో సమస్త ఆర్యవైశ్య సంఘం సభ్యులు మరియు సమస్త ఆర్యవైశ్య సోదర-సోదరీమణుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుతూ స్థానిక గాంధీచౌక్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.తదనంతరం సామూహిక కుంకుమార్చనతో  శ్రీ వాసవీమాతను పూజించారు,  తదనంతరం సామూహిక ఆరతి నిర్వహించి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.