14 July, 2026 | 4:43 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

దేశం గర్వించే నేత వాజ్‌పేయి

26-12-2025 02:43 AM

సికింద్రాబాద్/కంటోన్మెంట్ :  దేశం గర్వించే నేత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అని గవర్నర్ జిష్ణు దేవ్‌వర్మ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ బండా రు దత్తాత్రేయ, ఎంపీ ఈటల రాజేందర్ అన్నా రు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యం లో పికెట్‌లోని జేబీఎస్ అటల్ బిహారీ వాజ్‌పేయి పార్కులో గురువారం ఆయన 101వ జయంతి ఉత్సవాలు నిర్వహించారు. వాజ్‌పేయి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. అటల్ జీవితం రాజనీతిజ్ఞత, ప్రజాస్వామ్య విలువలు, కవిత్వం, అచంచలమైన అంకితభావానికి ప్రతీకగా నిలిచిందని, భరతమాత గర్వించే ముద్దుబిడ్డ వాజ్‌పేయి అని కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, కంటోన్మెంట్ బోర్డ్ సీఈవో అరవింద్ కుమార్ ద్వివేది, బీజేపీ ఉపాధ్యక్షురాలు బండ కార్తీకా చంద్రారెడ్డి, కంటో న్మెంట్ బోర్డు సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి, కార్పొ రేటర్లు సుచిత్ర, దీపిక, బీజేపీ నేత రాయల్ కుమార్ పాల్గొన్నారు.