గీతన్నల రాష్ట్ర చైతన్య బస్సు యాత్ర, గోడ పోస్టర్ ఆవిష్కరణ
తుంగతుర్తి (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆగస్టు 2 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న "అమరుల యాదిలో.. గీతన్నల చైతన్య యాత్ర" రాష్ట్ర బస్సు యాత్ర పోస్టర్ను శుక్రవారం మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు పులుసు వెంకటనారాయణ గౌడ్, మద్దెల నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... గీత కార్మికులకు ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రూ.4వేల పెన్షన్, ప్రమాద మరణ ఎక్స్గ్రేషియాను రూ.10 లక్షలకు పెంపు, 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికులకు పెన్షన్ అలాగే వృత్తి నిర్వహించే ప్రతి గీత కార్మికుడికి కాటమయ్య రక్షణ కవచం వంటి సంక్షేమ హామీలను ప్రభుత్వం త్వరితగతిన అమలు చేసి గీత కార్మిక కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు.






