ఒక్క విద్యార్థి.. ఐదుగురు ఉద్యోగులు!
15-03-2026 01:39 AM
ఇంటర్ పరీక్ష సెంటర్లో అనూహ్య ఘటన
నాగర్కర్నూల్, మార్చి 14 (విజయక్రాంతి): నాగర్కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రంలో శనివారం అనూ హ్య ఘటన చోటుచేసుకుంది. పదమూడవ రోజు నిర్వహించిన పరీక్షకు జనరల్ విభాగంలో కేటాయించిన ఒక్క విద్యార్థి మాత్రమే ఉండగా, ఆ విద్యార్థి కూడా పరీక్షకు హాజరు కాలేదు. అయితే పరీక్షా నిబంధనల ప్రకారం కేంద్రంలో సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్, ఇన్విజిలేటర్, పోలీస్ సిబ్బంది తదితరంగా మొత్తం ఐదుగురు సిబ్బందితో పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ సిబ్బంది అధికారులు విధులు నిర్వహించాల్సి వచ్చింది. చివరకు ఆ విద్యార్థి కూడా పరీక్షకు రాకపోవడంతో కేంద్రంలో సిబ్బంది ఖాళీగా విధులు నిర్వహించారు.




