లారీని ఢీకొట్టిన కారు.. సిద్దిపేటలో ఇద్దరు మృతి
02-06-2026 11:04 AM
మెట్టపల్లి: సిద్దిపేట(Siddipet) అర్బన్ మండలం మెట్టపల్లి వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టింది. లారీ కింద కారు ఇరుక్కుపోయి అందులో ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మహిళ సహా ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయలయ్యాయి. మృతులు, క్షతగాత్రులు మణుగూరు వాసులుగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.






