విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్
31-05-2026 06:28 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం స్థానిక 17వ డివిజన్ కు చెందిన సాయి ప్రియా ఇటీవలే విద్యుత్ ఘాతంతో ప్రమాదవశాత్తు మరణించగా, విషయం తెలుసుకొని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్ సహాకారంతో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో మంజూరైన విద్యుత్ బీమా రూ.5,00000 చెక్కును సంబంధిత కుటుంబ సభ్యులకు తుమ్మల యుగంధర్ చేతుల మీదుగా అందించడం జరుగింది.
ఈ సందర్భంగా భాదిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ప్రత్యేక చొరవ తీసుకొని చెక్కు రావడంలో కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి యువజన నాయకులు డా.యుగంధర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 17వ డివిజన్ ఇంఛార్జి ధనాల వెంకటరమణ, ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ పత్తికొండ శ్రీనివాస, తదితరులు పాల్గొన్నారు.






