టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం
ముకరంపుర,(విజయక్రాంతి): తెలంగాణ ఎన్జీవోల సంఘం కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం నిర్వహించారు. టీఎన్జీవోల జిల్లా అధ్యక్షులు, దారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర టీ ఎన్జీవోల అధ్యక్షులు, మారం జగదీశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖలో సూపరింటెండెంట్ గా సేవలందించి పదవీ విరమణ పొందిన చింతలపల్లి రాజి రెడ్డి రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం చింతలపల్లి రాజిరెడ్డి, ఇరిగేషన్ శాఖకు చెందిన ఒంటెల వెంకటరెడ్డి మరియు రవీందర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మారం జగదీశ్వర్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ సహజమైన ప్రక్రియ అయినప్పటికీ వారు ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






