9 May, 2026 | 1:11 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్త్

09-02-2026 12:00 AM

ఎస్పీ నరసింహ

సూర్యాపేట, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ కె. నరసింహ అన్నారు. ఈనెల 11వ తేదీన జిల్లాలోని సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలలో జరగనున్న రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఇతర శాఖలతో సమన్వయంగా పనిచేస్తున్నామన్నారు.

ఐదు మున్సిపాలిటీ కేంద్రాలలో మొత్తం 141 వార్డులకు గానూ 372 పోలింగ్ కేంద్రాలు ఉండగా, వాటిలో 115 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఎన్నికల కోసం 1250 మంది పోలీసు సిబ్బందితో రక్షణ బందోబస్తు నిర్వహణకు ప్రణాళిక రూపొందించామన్నారు.