10-02-2026 04:49:47 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ పట్టణంలోని చర్చ్ గేట్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం లారీ స్వీయ ప్రమాదానికి గురైంది. మదురై నుంచి మధ్యప్రదేశ్కు కొబ్బరికాయల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాజిని, క్లీనర్ దేవరాజ్కు స్వల్ప గాయాలు కాగా, లారీలో ఉన్న విఘ్నేష్కు కూడా తేలికపాటి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.