అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి
అమరావతి: సెల్ఫీలు(Selfie) తీసుకుంటూ జలపాతంలోకి జారిపడి ముగ్గురు యువతులు ప్రాణాలు కోల్పోయిన విషాదకరమైన సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharamaraju District ), అనంతగిరి మండలంలోని మల్లంగుమి గ్రామం సమీపంలో గురువారం జరిగింది. నివేదికల ప్రకారం, నలుగురు యువతులు గ్రామం సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లగా, సెల్ఫీలు తీసుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నీటిలో పడిపోయారు. వారిలో ముగ్గురు నీటిలో మునిగి మరణించగా, ఒక యువతిని స్థానికులు రక్షించారు. మృతులు బుర్జ పంచాయతీ పరిధిలోని జంబువలస గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఈ జలపాతం అనంతగిరి, హుకుంపేట మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో ఉన్నందున, సహాయక చర్యలు ఆలస్యమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




