04-02-2026 12:51:52 AM
బీఆర్ఎస్ మహిళ విభాగం రాష్ట్ర నాయకురాలు సుశీలరెడ్డి
కుషాయిగూడ, ఫిబ్రవరి 3 (విజయ క్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్పై కక్షగట్టి సిట్ విచా రణ పేరిట ఫోన్ టాపింగ్ నేపంతో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులపై వేధింపులు మానుకోవాలని బీఆర్ఎస్. మహిళ విభాగం రాష్ట్ర నాయకురాలు మరకట్ల సుశీల రెడ్డి అన్నారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక బీఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్ను కొనసాగిస్తున్నారని సుశీలరెడ్డి ఎద్దే వా చేశారు. మళ్లీ ఫోన్ టాపరింగ్ పేరిట వేధింపులకు పాల్పడితే తెలంగాణలో తిరుగుబాటు తప్పదని ఆమె హెచ్చరించారు.