23 March, 2026 | 3:51 PM

Breaking News

ఇది 1975 నాటి ‘ఇందిరమ్మ’ ఎమర్జెన్సీ పాలన!.. రాంచందర్ రావు అరెస్ట్   •   భట్టి మాటలకు అర్థాలే వేరులే   •   ఘట్ కేసర్ ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా లింగాల భూపాల్ ఎన్నిక   •   శ్రీ రామలింగేశ్వరలయం చైర్మన్‌గా అడ్డగుంట రాజేందర్   •   మంథని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అమరవీరుల దినోత్సవం   •   ఆరు గ్యారంటీల ప్రైవేట్ మెంబర్ బిల్లు.. నోటీసులను స్పీకర్‌కు అందజేసిన కేటీఆర్   •   పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు చేసిన జిల్లా కలెక్టర్   •   అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్   •   పదో తరగతి పరీక్ష కేంద్రాల్లో కలెక్టర్ తనిఖీ   •   మంథని బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ గా బాలోజీ   •  

చినూరు గ్రామంలో చోరీ.. బంగారం, వెండి అపహరణ

23-03-2026 10:49 AM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): చినూరు గ్రామంలో రాత్రి ఓఇంట్లో చోరీ జరిగినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని చినుర్ గ్రామంలో శనివారం రాత్రి గ్రామానికి చెందిన బోయిని సురేష్ తన ఇంటి తాళం వేసి కుటుంబసభ్యులతో ఉగాది సందర్భంగా గోపాల్పేట్లోని నల్ల పోచమ్మ జాతర మహోత్సవానికి వచ్చారు.

అనంతరం జాతర ముగించుకొని ఆదివారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా తలుపులకు వేసిన తాళాలు పగలగొట్టి ఉన్నాయని ఇంట్లో వెళ్లి చూడగా బీరువాలో గల ఆరు మాసాల బంగారం,9 తులాల వెండి పట్టీలు,బోధి వెండి 5 తులాలు, ఉంగరాలు రెండు తులాలు 20వేల నగదు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.బాధితులు చిన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.క్లూటీమ్తో నమూనాలు సేకరిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.