14 July, 2026 | 4:41 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

విద్యార్థుల ప్రతిభ అభినందనీయం

17-11-2025 05:24 PM

నిర్మల్ రూరల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో చదివి విద్యార్థులు భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా తమ ప్రదర్శనలు తయారు చేయడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో విద్యావ్యవస్థ ఎన్జీసి ఆధ్వర్యంలో నిర్మల్ వేస్ట్ టు వెల్త్ వృధా వస్తువుల నుంచి సంపదను సృష్టించడం అనే అంశంపై నిర్వహించిన పోటీలను ప్రారంభించారు. జిల్లాలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ, తిమ్మాపూర్ ఖానాపూర్ కు చెందిన అద్భుతమైన కళాకృతులు, గృహా అలంకరణ పశువులను తయారు చేసి అందరి ప్రశంసలు పొంది రెండవ బహుమతి సాధించారు. ఈ పోటీలలో పాఠశాలకు చెందిన విద్యార్థి కె.సూరజ్  ప్రధానోపాధ్యాయురాలు  కే.సుజాత సూచనలు సలహాల మేరకు కళాకృతులను తయారు చేశాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.