6 July, 2026 | 8:57 PM

Breaking News

సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •   జర్నలిస్టుల స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •   కొబ్బరితోట నరికివేత... పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మెచ్చా   •   ఇసుక వేలం.. రూ.2.76 లక్షల ఆదాయం..   •  

సర్పంచులను సన్మానించిన కాటా దంపతులు

18-12-2025 12:00 AM

గ్రామాభివృద్దే లక్ష్యంగా పనిచేయాలి

అమీన్ పూర్, డిసెంబర్ 17 : పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలోని గ్రామ పంచాయతీలకు మొదటి విడత ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులు సర్పంచులుగా విజయం సాధించగా సర్పంచులతో పాటు వార్డు మెంబర్లను పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, ఆయన సతీమణి కాటా సుధా శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటి విడత స్థానిక ఎన్నికల్లో నూతనంగా విజయం సాధించిన సర్పంచులు గ్రామంలో వీధిలైట్లు, శానిటేషన్, గ్రామస్తులకు తాగునీరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అన్నారు.

ఓటమి పాలైన కాంగ్రెస్ నాయకులు ఎవ్వరూ అధైర్యపడవద్దని వారందరూ సమయాభావంతో ఉండి గ్రామాల్లో మరింత సేవ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నూతన సర్పంచులు, ఉప సర్పంచ్లు , వార్డు సభ్యులు పాల్గొన్నారు.