6 June, 2026 | 9:54 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

పారదర్శక పోలీసింగ్ వ్యవస్థే లక్ష్యం

04-06-2026 01:16 AM

ఎస్పి స్నేహ మెహర

తాండూరు, జూన్ 3, (విజయక్రాంతి): ప్రజలకు సమర్థవంతమైన, పారదర్శకమైన పోలీసింగ్ సేవలను అందించడమే ప్రధాన లక్ష్యంగా ప్రతి పోలీసు కృషి చేయాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ స్నేహ మెహ్రా అన్నారు. బుధవారం ఆమె వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వార్షిక తనిఖీ నిర్వహించారు. 

పరిశుభ్రత, కార్యాలయ నిర్వహణ, రికార్డుల భద్రత, సిబ్బంది విధి నిర్వహణ తీరును సీఐ పరమేశ్వర్ తో అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు మరియు పోలీసులకు-ప్రజలకు మధ్య ఎలాంటి అంతరాలు లేకుండా నిరంతరం అందుబాటులో ఉండే విధంగా అధికారులు, సిబ్బంది విధులు నిర్వహించాలని ఆదేశించారు.