13 May, 2026 | 4:44 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

ప్రజా పాలనతో జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలి

13-03-2026 12:53 AM

రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటకశాఖ మంత్రి జూపల్లి

నాగర్ కర్నూల్, మార్చి 12 (విజయక్రాంతి)ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక ద్వారా నాగర్ కర్నూల్ జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శ జిల్లాగా నిలపాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే జిల్లాకు రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు వస్తుందని పేర్కొన్నారు.

జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక  99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అవగాహన సదస్సును మంత్రి ప్రారంభించారు. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించి ప్రభుత్వ పథకాలు అందరికీ చేరేలా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్ , ఎమ్మెల్యేలు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి , చిక్కుడు వంశీ కృష్ణా , కసిరెడ్డి నారాయణ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.