31 August, 2026 | 10:34 AM

Breaking News

40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •  

చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పొడిగించాలి

31-08-2026 09:23 AM

భద్రాద్రి కొత్తగూడెం, (విజయశాంతి):  చేయూత పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించాలని రాష్ట్ర మైనారిటీ అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.ఓ పక్క ఎస్‌ఐఆర్‌లో పేర్లు లేకపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరగడం, మరోపక్క చేయూత వెబ్‌సైట్‌లో సర్వర్ సమస్యల కారణంగా అర్హులైన పేదలు దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

వితంతువులు, దివ్యాంగులు,ఒంటరి మహిళలు తదితర అర్హులకు చేయూత పెన్షన్ జీవనాధారంగా ఉందన్నారు. సాంకేతిక సమస్యల కారణంగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న లబ్ధిదారులు నిరాశకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే సర్వర్ సమస్యలను పరిష్కరించడంతో పాటు దరఖాస్తుల గడువును మరో 10 రోజుల పాటు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని ఎండీ యాకూబ్ పాషా కోరారు.