2 September, 2026 | 10:25 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

అయోధ్య అవినీతి ఆరోపణలపై బీజేపీ స్పందించాలి

07-07-2026 | 12:00am

మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జూలై 6: అయోధ్య శ్రీరామ మందిరం పేరుతో దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి రాజకీయ ప్రయోజనాలు పొందిన భారతీయ జనతా పార్టీ, ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న ఆరోపణలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

సోమవారం జిల్లెలగడ్డలో విలేకరులతో మాట్లాడిన ఆయన, శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించిన నిధుల వినియోగం, అవినీతి ఆరోపణలపై బీజేపీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. ఆరోపణల్లో నిజానిజాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు, తప్పులు జరిగి ఉంటే దేశ ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. రాముడి పేరును రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించారని ఆరోపించిన మంత్రి, అయోధ్య ప్రజలే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

పవిత్రమైన రామజన్మభూమికి సంబంధించిన అంశాల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడం హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై దేశంలోని మత పెద్దలు, హిందూ సంస్థలు కూడా స్పందించాలని కోరారు. ఎన్నికల సమయంలో ‘జై శ్రీరామ్‘ నినాదాలతో ఓట్లు కోరిన బీజేపీ, ఇప్పుడు అదే శ్రీరాముడి ఆలయానికి సంబంధించిన వివాదాలపై మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై కూడా విమర్శలు చేసిన ఆయన, మతాన్ని రాజకీయాలకు వినియోగించడం కాంగ్రెస్ పార్టీ విధానం కాదని వ్యాఖ్యానించారు.