1 July, 2026 | 11:10 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

న్యాయవాది కళ్యాణిపై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి

24-02-2026 12:58 AM

జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులచారి  

నిజామాబాద్ ఫిబ్రవరి23 (విజయక్రాంతి): బోధన్ డివిజన్ రుద్రూర్లో న్యాయవాది కళ్యాణి పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని నిజామాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు దినేష్ కులచారి డిమాండ్ చేశారు. ఈ దాడి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే అని,హిందువులపై దాడులు చేస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. రుద్రూర్లో న్యాయవాది కళ్యాణి పై దాడి తో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపుతప్పిందని, హిందువులపై జరుగుతున్న దాడులను అడ్డుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

మొన్న బాన్సువాడలో, నిన్న రుద్రూర్లో జరిగిన ఘటనలు కేవలం యాదృచ్ఛికం కావని, ఇవి పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతున్న దాడులేనని దినేష్ పటేల్ కులాచారి  ఆరోపించారు. రాష్ట్రంలో హిందువులపై దాడులు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మౌనం వహించడం వెనుక తీవ్రమైన రాజకీయ స్వార్థాలు ఉన్నాయనే అనుమానాన్నీ ఆయన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చేసిన కాంగ్రెస్ అంటే ముస్లిం  ముస్లిం అంటే కాంగ్రెస్ అనే వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనం అన్నారు. 

బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఒక వర్గాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని, దాని ఫలితంగానే రాష్ట్రంలో ఇలాంటి దాడులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చింత శ్రీనివాస్ రెడ్డి, ప్రమోద్ కుమార్, నూతల శ్రీనివాస్ రెడ్డి, ఆనంద్, జగన్ రెడ్డి, ఆనంద్ రావు, గడ్డం రాజు, బొబ్బిలి వేణు, నరేష్, అమంద్ విజయ్ కృష్ణ, చిరంజీవి, శ్రీకాంత్, ప్రతాప్, అర్జున్ రెడ్డి పాల్గొన్నారు.