1 July, 2026 | 10:01 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

24-02-2026 01:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,ఫిబ్రవరి 23(విజయక్రాంతి): కెరమెరి మండలంలోని సావర్ ఖేడ్ గ్రామ శివారులో అక్రమంగా గంజాయి తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ మధుకర్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సావర్‌ఖేడ్ గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపడుతుండగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న సరోజిత్ మండల్‌ను తనిఖీ చేయగా,

అతని వద్ద నుంచి 210 గ్రాముల గంజాయి లభ్యమైంది.స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.5,250 ఉంటుందని పోలీసులు తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.గంజాయి విక్రయం, కొనుగోలు లేదా వినియోగంలో పాల్గొన్న వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.