calender_icon.png 5 February, 2026 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ అధ్యక్షుడి రాకతో శ్రేణుల్లో నూతనోత్సాహం

05-02-2026 01:39:17 AM

బీజేపీ నేత పద్మ వీరపనేని

జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): తెలంగాణకు బిజెపి నూతన జాతీయాధ్యక్షుడు రావడంతో శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొందని బిజెపి మహిళా మోర్చా జాతీ య కార్యవర్గ సభ్యురాలు, బిజెపి తమిళనాడు రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి డాక్టర్ పద్మ వీరపనేని అన్నారు. తొలిసారిగా తెలంగాణకు విచ్చేసిన నితీశ్ నమిటీ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

తన ప్రచార షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా బుదవారం తిరుగు ప్రయాణం అయ్యారు. ఈ సందర్భంగా నాయకులతో కలిసి ఆయనకు పద్మ వీరపనేని వీడ్కోలు పలికారు. అనంతరం మాట్లాడుతూ నూతన యువ నాయకత్వంలో, సీనియర్ల అనుభవంతో పార్టీ మరింత పటిష్టమవుతుందని ధీమా వ్యక్తం చేశారు.