4 July, 2026 | 9:52 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

టెట్ హాల్ టికెట్లు విడుదల

28-12-2025 01:13 AM

సుదూర ప్రాంతాల్లో సెంటర్ల కేటాయింపు

హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): టెట్ హాల్‌టికెట్లను విద్యాశాఖ శనివారం విడుదల చేసింది. జనవరి 3, 4, 5, 6, 8, 9, 11, 19, 20 తేదీల్లో పరీక్షలు ఉం టాయి. ఉదయం 9 గంటల నుంచి 11.30 గమల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 వరకు రెండో సెషన్ ఉంటుంది. అయితే ఉదయం సెషన్‌కు 7.30 గంటలకు, మధ్యాహ్నం సెషన్‌కు 12.30 గంటలకు పరీక్షా హాలులోకి అభ్యర్థులను అనుమతిస్తారు. హాల్‌టికెట్ వెనుకాల ఉన్న సూచనలను అభ్యర్థులు పాటించాలని అధికారులు తెలిపారు.

పేపర్1, 2లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 18 జిల్లాల్లో 97 కేంద్రాలను ఏర్పాటు చేశారు. గతంలో కంటే ఈసారి సెంటర్లను పెంచారు. ఫిబ్రవరి 10 తేదీల మధ్య ఫలితాలను వెల్లడించనున్న సంగతి తెలిసిందే. టెట్‌కు దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులు తమ సొంత జిల్లా, తర్వాత పక్క జిల్లాల కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు సెంటర్లను ఆప్షన్లుగా పెట్టుకున్నారు. 200 కి.మీ. దూరం నుంచి 450 కి.మీ. దూరంలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించినట్లు వాపోయారు. దీంతో తా ము ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలిపారు. ఉదాహరణకు నిర్మల్ నుంచి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఖమ్మంకు ఇలా కేటాయించారు.