ఘనంగా అవతరణ వేడుక
02-06-2026 06:16 PM
పాపన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుక పాపన్నపేట మండల వ్యాప్తంగా ఘనంగా జరిగింది. మంగళవారం పాపన్నపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ పావని నరేందర్ గౌడ్, మండల వనరుల కేంద్రం వద్ద ఎంఈఓ ప్రతాప్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో విష్ణువర్ధన్, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏవో శ్రీనివాస రాజు, ఎమ్మార్వో కార్యాలయం వద్ద తహశీల్దార్ సతీష్ కుమార్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలాధ్యక్షుడు నరేందర్ గౌడ్, భారాస పార్టీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్ గురుమూర్తి గౌడ్ జాతీయ పతికావిష్కరణ చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.






