2 June, 2026 | 7:11 PM

Breaking News

కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •  

పలు గ్రామాల్లో పీసీసీ కేంద్రాలను సందర్శించిన డిసిఎస్ఓ వెంకటేశ్వర్లు

02-06-2026 06:13 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని మాటూర్, మాసానిపల్లి, వదల్పర్తి గ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో పిసిసి కేంద్రాలను డిసిఎస్ఓ.వెంకటేశ్వర్లు మరియు డిఎం.శ్రీకాంత్ కలిసి సందర్శించి పరిశీలించారు. పీసీసీ కేంద్రాలలో వడ్ల కాంట చేయడంలో ఆలస్యాలపై, సమస్యలపై రైతులను ఆరాధిస్తారు. జూన్ మాసం వచ్చిందని రైతులెవరు ఆచార్య పడవద్దని పూర్తిస్థాయిలో మరి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని లేనిపోని అపోహలకు గురికావద్దని రైతులకు ధైర్యం నింపారు. మాసంపల్లి పిసిసి సెంటర్ విజయవంతంగా క్లోజ్ చేయడం జరిగిందన్నారు. మండలంలోని మిగతా పీసీసీ సెంటర్లను కూడా పూర్తిస్థాయిలో క్లోజ్ చేయడం జరుగుతుందని తెలిపారు.మాసంపల్లి పీసీసీ సెంటర్ క్లోజ్ చేయడానికి సహకరించిన జిల్లా అధికారులకు నాగిరెడ్డిపేట్ మండల ఏపీఎం రామ్ నారాయణ గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.