తెలంగాణ డిజిటల్ క్యాబినెట్
18-06-2026 03:12 PM
హైదరాబాద్: రాష్ట్ర మంత్రి వర్గ సమావేశాలను పేపర్ లెస్ గా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న మంత్రుల ప్రత్యేక సమావేశంలో తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహణకు ఆమోదించారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరికి స్పెషల్ ట్యాబ్ లు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ బుక్ ద్వారానే మంత్రులకు క్యాబినెట్ సమావేశం ఎజెండాగా పెట్టుకున్నారు. పేపర్ లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహించారు.






