27 March, 2026 | 4:26 AM

రాములోరి కల్యాణానికి తీన్మార్ మల్లన్నకు ఆహ్వానం

27-03-2026 02:43 AM

మాధవానగర్ కాలనీ సంఘం ఆహ్వాన పత్రిక అందజేత

ఎల్బీనగర్, మార్చి 26 :  సీతారామ కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్నకు కర్మన్ ఘాట్ డివిజన్ లోని మాధవ నగర్ కాలనీ సంక్షేమ సంఘం  అసోసియేషన్ అధ్యక్షుడు ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం 11గంటలకు కర్మన్ ఘట్  డివిజన్ లోని మాధవ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ ముదిరాజ్ గురువారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను గురువారం స్థానిక నాయకులతో వెళ్లి కలిశారు.

శుక్రవారం ఉదయం 11గంటలకు సీతారాముల కల్యాణ మహోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్ చార్జి బొంగు వెంకటేష్ గౌడ్, నాయకులు ఎమ్మా భాషా, పల్లెల నర్సింహ రెడ్డి తదితరులు ఉన్నారు.