ఉపాధ్యాయుల నిరసన
06-04-2026 06:06 PM
నిర్మల్,(విజయక్రాంతి): పదవ తరగతి పరీక్షల మూల్యాంకన పారితోషికం చెల్లించాలని మంగళవారం ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ధర్మం నిర్వహిస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు భూక్య రాజేష్ నాయక్ దాసరి శంకర్, రవికాంత్, క్రాంతి కుమార్, హరి హరి ప్రసాద్, మష్యుద్దిన్, మహేంద్ర చారి, శశిరాజ్, దేవేందర్, తదితరులు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత సంవత్సరం సమగ్ర కుటుంబ సర్వే నిధులు, గత సంవత్సరం పదవ తరగతి పరీక్ష పేపర్లు దిద్దిన ఉపాధ్యాయులకు డబ్బులను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.




