ఎన్ఎంఎంఎస్ లో నర్మెట్ట విద్యార్థుల ప్రతిభ
24-02-2026 09:27 PM
నంగునూరు,(విజయక్రాంతి): నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ (ఎన్ఎంఎంఎస్) ఫలితాల్లో నర్మెట్ట ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.పాఠశాలకు చెందిన గొట్టే శివకుమార్, మోటకోడూరు జనని, చెలిమెల శశిధర్ రెడ్డి ఈ స్కాలర్షిప్కు ఎంపికైనట్లు మండల విద్యాధికారి తగిరెడ్డి దేశిరెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించేందుకు నిర్వహించే ఈ పరీక్షలో ఎంపికైన వారికి 8వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు ఏడాదికి 12 వేల రూపాయల ఆర్థిక సహాయం అందుతుందని ఆయన తెలిపారు. విద్యార్థుల విజయంపై పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు.




