15 June, 2026 | 8:58 PM

Breaking News

విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ   •   ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •  

సీఎంఆర్‌ఎఫ్‌ను సద్వినియోగం చేసుకోండి

25-02-2026 12:28 AM

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి 

మేడ్చల్, ఫిబ్రవరి 24 (విజయ క్రాంతి): ఆపద సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సద్వినియోగం చేసుకోవాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆసుపత్రులలో చికిత్స సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

వరికైనా సీఎంఆర్‌ఎఫ్ నుంచి సహాయం కావాలంటే తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. అల్వాల్ డివిజన్ ఎస్సీ బస్తికి చెందిన వెంకటేష్ అనారో గ్యంతో బాధపడుతుండడంతో చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకోగా రూ. 2.25 లక్షలు, ఎస్పి నగర్ లోని బాలాజీ ఫంక్షన్ హాల్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ నదీమ్‌కు రూ.3.25 లక్షలు ఎల్‌ఓసిలు మం జూరయ్యాయి.

ఎల్‌ఓసిల మంజూరుకు కృషిచేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు శాంతి శ్రీనివాస రెడ్డి, జగదీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.