21 May, 2026 | 3:19 PM

Breaking News

తెల్ల తెల్లవారుతుండగానే పల్లెల్లోకి పాఠశాలల ప్రచారం.. విత్తన కంపెనీల ప్రచార రతాలు   •   ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి ఒక్కరికి క్రీడలు అవసరం   •   ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి..   •   ఆరోగ్యం బాగుంటేనే జీవితం సార్థకం   •   ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్   •   అనుమతి లేని ప్రైవేట్, విద్యాసంస్థలను మూసివేయాలి   •   కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెన్త్ టాపర్ కు సైకిల్ బహుకరణ...   •   జైనూర్‌లో చలివేంద్రం – అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   బాన్సువాడలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు...   •   ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు   •  

చేయూత పెన్షన్లలో అక్రమాలపై అనుమానాలు

21-05-2026 02:34 PM

సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్ పొందుతున్న వారిపై నిఘా అవసరం

కారేపల్లి,(విజయక్రాంతి): చేయూత పెన్షన్లు(Cheyutha Pensions) పొందుతున్న లబ్ధిదారులకు వారి ఆధార్ కార్డుతో పెన్షన్(Pension with Aadhaar Card) ఆథెంటికేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతోంది. ఇంకా ఆథెంటికేషన్ చేయించుకోని వారు తమ ఆధార్ కార్డుతో సంబంధిత పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి వెంటనే పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇది అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. అయితే గ్రామాల్లో అక్రమంగా సదరం సర్టిఫికెట్ల ద్వారా పెన్షన్లు పొందుతున్న వారిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అర్హత లేకుండా పెన్షన్లు పొందుతున్న వారిని ఎంతమందిని గుర్తించారు..? ఇప్పటివరకు ఎన్ని పెన్షన్లు తొలగించారు..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.అక్రమాలను అరికట్టాల్సిన  అధికారులు క్షేత్రస్థాయిలో విచారించి సదరం సర్టిఫికెట్ల ద్వారా పింఛన్లు పొందుతున్న వారిపై గ్రామస్థాయిలో విచారణ జరిపి  నిజమైన అర్హులైన పేదలకు న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేపట్టి పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.