calender_icon.png 19 February, 2026 | 4:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

19-02-2026 02:03:04 PM

న్యూఢిల్లీ: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు(Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు రాష్ట్రాల అభివృద్ధికి విఘాతం కలిగిస్తున్నాయని సుప్రీంకోర్టు సూచించింది. చాలా రాష్ట్రాలు ఆర్థిక లోటు ఎదుర్కొంటున్నాయని తెలిపింది. ఆర్థిక లోటులో ఉన్నా ఉచిత పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొంది. ప్రభుత్వాలు అభివృద్ధిని పట్టించుకోకుండా ఉచితాలు అమలు చేస్తున్నాయని వెల్లడించింది. ఉ

చిత ఆహారం, సైకిళ్లు, విద్యుత్ కు బదులు ఉపాధికి కృషి చేయాలని సుప్రీంకోర్టు పిలుపునిచ్చింది. ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా అందరికీ ఉచిత విద్యుత్ ఇస్తామని డీఎంకే(DMK) హామీ ఇచ్చింది. డీఎంకే పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు కేంద్రప్రభుత్వానికి(Central Government) నోటీసులు ఇచ్చింది. ఉచిత హామీలు ఇస్తున్న పార్టీల తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. ఉచిత పథకాలు భూ యజమానులకు కూడా అందుతున్నాయన్న సుప్రీంకోర్టు అర్హులకు మాత్రమే ఉచిత పథకాలు అందాలని సూచించింది.