12 July, 2026 | 4:14 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

జిల్లా కలెక్టర్ నియామకంతో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ

14-02-2026 01:19 AM

భక్తుల వద్ద అదనపు డబ్బులు వసూల్ చేస్తే చర్యలు తప్పవు.

రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): వేములవాడ అంగరంగ వైభవం జరిగే శివరాత్రి పర్వదినాన వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా కల్యాణ కట్ట పర్యవేక్షణలో భాగంగా జిల్లా ఇండస్ట్రీయల్ మేనేజర్ హన్మంత్ నాయక్ కు శివరాత్రి ముగించే వరకు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ గా ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా హన్మంత్ నాయక్ మాట్లాడుతు. శివరాత్రి రోజు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని వసతులు అందేవిధంగా చూస్తామని అన్నారు.తల నీలాలు ఇచ్చేవారి దగ్గర ఎలాంటి అదనపు రుసుము వసులు చెయ్యరాదని హేచ్చరించారు. ఎలాంటి సమస్యలున్న నేరుగా వచ్చి తెలపాలని కోరారు.