4 May, 2026 | 3:37 AM

సన్ డే.. ఎండా వేడితో ప్రజలు బెంబేలు

04-05-2026 02:23 AM

నిర్మల్ మే 3 ( విజయ క్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆదివారం సూర్యుడు మండిపోయారు. రికార్డ్ స్థాయిలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకోవడంతో ఎండకు తోడు వేడి గాలులు వీస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఎండలు పెరుగుతూ మధ్యాహ్నం నిప్పుల కొలిమిగా మండిపోతున్నాయి. సాయంత్రం ఐదు గంటల వరకు వేడి గాలులు వేయడంతో మధ్యాహ్నం పూట రోడ్లన్నీ జనం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.

అత్యవసర పరిస్థితులు బయటకు వస్తే జనాలు గొడుగులు, తలకు రుమాలు టోపీలు పెట్టుకుని బయటకు వస్తున్నారు. చల్లని పానీయాలను తాగుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే రైతులు కూలి పనులు చేసే కార్మికులు ఎండా వేడిమి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. రోడ్లపై చిరు వ్యాపారం చేసేవారు వ్యాపారం లేక ఇబ్బందికి గురవుతున్నారు.