18 April, 2026 | 10:56 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ

18-04-2026 09:14 PM

నస్పూర్,(విజయక్రాంతి): కనీస సామర్ధ్యాలలో వెనకబడిన విద్యార్థుల కోసం వేసవి సెలవుల్లో ఇంటి వద్ద స్వయంగా, సులభంగా అభ్యసించే విధంగా తెలుగు, ఇంగ్లీష్, గణితం విషయాలు క్రోడీకరించి "వేసవి సెలవుల నేస్తం" శీర్షికతో రూపొందించిన పునరభ్యసన పుస్తకం, రీడింగ్ పోస్టర్లను శని వారం జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ యాదయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు.


ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ దండేపల్లి మండలం గుడిరేవు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (MPPS) ఉపాధ్యాయుడు బొలిశెట్టి బుచ్చన్న విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే రీతిలో తయారు చేసిన పుస్తకం వెనుకబడిన విద్యార్థులకు దోహదపడుతుందని, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడానికి ఈ పునరభ్యసన పుస్తకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వెనుకబడిన విద్యార్థుల కోసం రూపొందించిన ఉపాధ్యాయుడు బుచ్చన్నని ఈ సందర్భంగా అభినందించారు.