calender_icon.png 10 February, 2026 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లా స్థాయి క్రీడా పోటీలకు విద్యార్థులు ఎంపిక

10-02-2026 06:54:10 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఈనెల 13వ తేదీన మంచిర్యాల జిల్లా కేంద్రంలో జరిగే జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో బెల్లంపల్లికి చెందిన తమ విద్యార్థులు ఎంపికైనట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ కోచ్ సల్పల సంతోష్ తెలిపారు కే. దీక్ష,యు. సాయి యశ్వంత్, ఎం. సహస్య, ఎండి. గౌసుద్దీన్, కే. సహస్ర, బి. విష్ణువర్ధన్ ఈనెల 6వ తేదీన  బెల్లంపల్లి జనరల్ వెల్ఫేర్ కాలేజీ క్రీడా మైదానంలో జరిగిన చీఫ్ మినిస్టర్ కప్ పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. తమ అసోసియేషన్ క్రీడలకు పెద్దపీట వేస్తుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.