26 February, 2026 | 2:30 AM

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

26-02-2026 12:40 AM
  1. వనపర్తి జిల్లా గిరిజన తండాకు చెందిన వసంత
  2. మానసిక వేదనే కారణమని భావిస్తున్న పోలీసులు

నిర్మల్, ఫిబ్రవరి 25 ( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న ఏ వసంత (19) అనే విద్యార్థిని బుధవారం ఆత్మహత్య చేసుకుంది. తోటి విద్యార్థినులంతా తరగతులకు వెళ్లిన సమయంలో హాస్టల్‌లోని ఒక గది లో ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వనపర్తి జిల్లా గిరిజన తండా చెందిన వసంత బాసర త్రిబుల్ ఐటీలో ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతుంది.

హాస్టల్ గదిలో నుంచి ఆమె ఎంతసేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు వచ్చి తలుపులు తెరవడంతో విద్యార్థి ఆత్మహత్య ఘటన తెలిసింది. వెంటనే వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ త్మహత్యకు ప్రేమే కారణమని అంటున్నారు. వసంత ప్రేమించిన గణేష్ హైదరాబాదులో చదువుకుంటూ హాస్టల్ గదిలో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషయం తెలుసుకున్న వసంత మానసిక వేదనతో హాస్టల్ గదిలోని ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. అయితే పోలీసులు ఆత్మహత్యకు వ్యక్తిగత కారణమై ఉంటుందని భావిస్తున్నారు. మంగళవారం రాత్రి వసంత ఒకరితో ఫోన్‌లో మాట్లాడిందని ఆ ఫోన్ ఎవరిది అని పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆత్మహత్య చేసుకున్న వసంత మృతదేహాన్ని పోలీ సు బందోబస్తు మధ్య బైంసా ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష నిర్వహించి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.